Saturday, August 21, 2021

96 MINUTES BALVIKAS PROGRAM. VEDAM BHAJAN ETC.,


                                                         
 



 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహ అశీస్సులతో, స్వామివారి  శుక్రవారం   27-8-2021  రోజున ,స్వామి వారి 96 వ జన్మదినోత్సవ సందర్భముగా 96 నిమిషముల కార్యక్రమం బాల వికాస్ విద్యార్థులచే  నిర్వహించ దలచినాము.

కార్యక్రమ వివరాలు:-

1. ఓంకారం, గణపతి, సరస్వతి ప్రార్ధన. బాలవికాస్ విద్యార్థులచే

2 .స్వామి వారి అష్టోత్తర పూజ - బాలవికాస్ బాలికలచే

3. స్వామివారి పాదుకా స్తోత్రం బాలవికాస్ విద్యార్థులచే

4. వేదం: రుద్రం ఒకొక్క అనువాకం - ఒక విద్యార్థిచే

5. భజనలు - గణపతి,(2 )  గురు,(2 ) మాత (2 ) భజనలు  తరువాత్త అన్ని భజనలు---- 

6. అసతోమా..

7. స్వామి వారి సందేశం.

8. మంగళ హారతి.

9. విభూతి ప్రసాదం.

REPORT DT 27-8-2021

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, 96 నిమిషముల, బాలవికాస్ విద్యార్థుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది. 

ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా  జరిపించిన  స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 

ఈ కార్యక్రమం, జ్యోతి ప్రకాశంతో, ప్రారంభమై, మూడు సార్లు ఓంకారం, గణపతి ప్రార్ధన సరస్వతి ప్రార్ధన, అనంతరం, భగవాన్ సత్యసాయి బాబా వారి అష్టోత్తర శతనామావళి, ఒకటి నుంచి 40 నామాలు, సత్యసాయి భద్రాదేవి, 40 నుండి 60 నామాలు, జయగాయత్రి నాగ, హేమాంగ్ - 60 నుంచి 80 నామాలను, చివరగా, ప్రణవెండర్ రెడ్డి 80 నుంచి 108 నామాలను, ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆలపిస్తూ  పూలతో, అక్షతలతో, వీడియో మోడ్ లో, లో పూజలు నిర్వహించారు. దీనితో పాటుగా, శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు, ఆలపించిన, శ్రీ సత్య సాయి  పాదుకా  అష్టోత్తరం, వింటూ, విద్యార్థులంతా, స్వామివారి, పాదాలకు పూజలు నిర్వహించారు. 

బాలవికాస్ విద్యార్థులు, వారికి కేటాయించిన, శ్రీ రుద్రం లోని 11 అనువాకము లు, ఎంతో భక్తితో, పఠించారు. 

ఈ కార్యక్రమంలో, పాల్గొన్న విద్యార్థులు అందరూ, వారికి వచ్చిన, అన్ని భజనలను, ఎంతో శ్రావ్యంగా, ఆలపించి, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు, పొందారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు, పెద్దలు, శ్రీ జగన్ మోహన్ రావు గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నిర్మల గారు, శ్రీ సువర్ణ  లక్ష్మి గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు, పొత్తూరి సీతామహాలక్ష్మి గారు, శ్యామల గారు, నెహ్రూ గారు, గురువులను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి సభ్యులను, అందరిని, ప్రశంసించి, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.

శ్రీమతి ఏ సీతామహాలక్ష్మి, బాలవికాస్ ఇంచార్జి  మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి గారి 158వ  జయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి, గత కొన్ని సంవత్సరాలుగా, నిర్వహిస్తున్నట్లు, అందరికి తెలియజేస్తూ,  ఈ కార్యక్రమాన్ని రేపు, మరియు ఎల్లుండి, అనగా 28,  29 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మొదటి రోజు అంటే 28వ తేదీ నాడు, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, 29వ తేదీ నాడు, సత్యసాయి ప్రోత్సాహక పురస్కార గ్రహీతలు,( కోటి సమితి) 24 మంది లో కొంత మంది పాల్గొంటారు. ఈ మధ్యనే  రేడియో సాయి  దశమ వార్షికోత్సవం సందర్భంగా, చిరు నాటికల ద్వారా, పరిచయమైన, 10 మంది విద్యార్థులు, కూడా పాల్గొనే దిశగా, అందరికి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారు, ప్రముఖులు, పాల్గొననున్నారు. 

చివరగా, శ్రీమతి శైలేశ్వరి గారు, ఎంతో భక్తి శ్రద్ధలతో, నేర్పిన రుద్రం, పిల్లలు కూడా శ్రద్ధగా నేర్చుకొని స్వామికి, సమర్పించారు. 

మహిళా ఇన్చార్జ్ విజయలక్ష్మి గారు, కల్పన గారు, మహాలక్ష్మి గారు, చల్ల మల్ల వెంకటలక్ష్మి రెడ్డి గారు, పాల్గొన్నారు. 

చివరగా, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, దివ్య సందేశాన్ని, ముఖ్యంగా విద్యార్థులకు, మరియు తల్లిదండ్రులకు, మరియు బాలవికాస్ గురువులను, ఉద్దేశించిన, దివ్య సందేశాన్ని, వినిపించారు. 

చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, లీలాధర్, భద్రాదేవి, ప్రణవ్, గాయత్రి, హేమాంగ్ , సాయి, నాగ, రశ్మిత, ధీమహి, సాయి గుప్త, శరణ్య, సాయి రూప, సాయి లక్ష్మి, ధనుంజయ్, మనస్వి, అందరూ ఎంతో, గురువులు నేర్పిన, క్రమశిక్షణతో, కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అందరూ కలిసి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం మనం దిగ్విజయంగా ముగిసింది.

55 భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. 


ప్రోగ్రాం లింక్ 


----00000---


No comments:

Post a Comment