Thursday, December 1, 2022

GEETA JAYANTHI VEDUKALU: 3-12-2022: KUNTAROAD HIGH SCHOOL, OSMAN GUNJ. HYD.

 














Report on dt 3-12-2022 గీతా జయంతి వేడుకలు

 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి  ఆధ్వర్యంలో ఈరోజు అనగా 3 డిసెంబర్,   2022న హైదరాబాద్, ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా   మసీదుకు సమీపములో ఉన్న, గవర్నమెంట్ హై స్కూల్, కుంట రోడ్డు,నందుశ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్, విద్యార్థులతో " గీతా జయంతి వేడుకలు కార్యక్రమము  శ్రీమతి రేణుక గారు, ముఖ్య అతిధి స్వామి చిరకాల భక్తులు శ్రీ శరత్ కృష్ణ పరాయత్తం  మరియు సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం గావించి, ప్రారంభించారు. 

 శ్రీమతి కన్నా రెడ్డి రేణుక గారు,   గత రెండు నెలల నుండి నేర్పిన శ్లోకాలు విద్యార్థులు " నహి జ్ఞానేన సద్రృశం పవిత్ర మిహ విద్యతే - తత్ స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని విన్దతి. అనే శ్లోకలనుఎంతో భక్తి శ్రద్దలతో ఏకకంఠంతో ఈ పవిత్ర గీతా జయంతి వేడుకల సందర్భంగా,   వినిపించి, గురుదక్షిణగా  ఇచ్చారు.   

 ముఖ్య అతిధి, స్వామి చిరకాల భక్తులు శ్రీ శరత్ కృష్ణ పరాయత్తం, శ్రీ సత్య సాయి బాలవికాస్  గ్రూప్ - I లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రములను బహుకరించిన అనంతరం వారు  మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా  సంస్థలు కోటి సమితి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమము, ఎంతగానో కొనియాడుతూభగవద్గీత  ప్రాముఖ్యతను, విద్యార్థుల స్థాయిలో విశదీకరించిభగవద్గీతలో  అన్నిభాషలలో వున్నదని, అన్ని దేశాలలో ఈ రోజు గీతా జయంతి జరుపువుకున్నారని, మనము కూడా ఎంతో అదృష్టవంతులమని  మనము కూడా రోజు  భగవత్ గీత ఒక్క శ్లోకము చదివి దాని భావాన్ని తెలుసుకొని, మన నిత్యజీవితములో అనుసరించవనేనని తెలిపారు. అందరితో ఈ శ్లోకాన్ని వల్లెవేయించారు.  అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।।

 ఈ కార్యక్రమంలో, శ్రీమతి విజయ లక్ష్మి , శ్రీమతి కల్పనా, శ్రీమతి సునీత,   హై స్కూల్ ప్రిన్సిపాల్, శ్రీ కె. శశికళ గారుశ్రీ దార సింగ్ గారు  శ్రీ వి నాగేశ్వర రావు  పాల్గొన్నారు సాయిరాం 

  

కన్వీనర్ 

పి . విశ్వేశ్వర శాస్త్రి. 



Friday, July 15, 2022

KOTI SAMITHI BALVIKAS GROUP II EXAMINATION CANDIDATES: DT 24-7-2022

 




 *With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, Sri Sathya Sai Balvikas Group II Examination conducted smooth and and Question Papers Both English and Telugu were kept at Divine Lotus Feet and opened after chanting Omkaaram, Gayatri Mantra, and Shantimantrams. at 10-02 and given the Answer Books and Question Papers... at 12-02 Examination completed all the 9 Students and all the Answer Books collected after completion of writing marked the sl nos also and kept in sl along with coverning letter and duly sealed handed over to Sri Hariharan Garu, at Sivam Office at 1-25 Pm today. Sairam*













KUMARI SAIROOPA, MASTER HEMANG, MASTER PRANAV, MASTER SAI GUPTA HAVE COMPLETED PROJECT WORK AND PLACED THE SAME AT THE LOTUS FEET OF OUR BELOVED BHAGAWAN SRI SRI SRI SATHYA SAI BABA VARI AT SIVAM ON 25-12-2022 

Saturday, December 11, 2021

WALK FOR THE VALUES: 13-12-2021 WITH PRESS CLIPPINGS

 








"మానవతా విలువల పై విద్యార్థుల ప్రదర్శన"

ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో,  విలువలతో కూడిన నడక పేరిట, చేసిన ప్రదర్శనలో  పాల్గొన్న విద్యార్థులు, నీతి వాక్యాలు మానవతా విలువలతో  రూపొందించిన, ప్లై  కార్డులను చేత పట్టుకొని సాయి గాయత్రీ మంత్రం పఠిస్తూ  సుల్తాన్ బజార్,  ప్రధాన వీధుల్లో ప్రదర్శన గావించారు. 

దేవుడు ఒక్కడేనని,  సాటి మనిషిని ప్రేమిస్తూ సేవా తత్వాన్ని కలిగి ఉండడమే జీవిత పరమార్థమని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి,  సభ్యులు  విలువలతో కూడిన  ర్యాలీని కోటి సమితి దత్తత తీసుకున్న సుల్తాన్ బజార్, బడే చౌది లో నయా బజార్ గవర్నమెంట్, హై స్కూల్ లో, అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్, జండా ఊపి విలువలతో కూడిన నడకను ను ప్రారంభించారు. 

తొలుతగా కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, వేదం, సాయి గాయత్రీ మంత్రములను జపిస్తూ, కార్యక్రమము కొనసాగినది. అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్,  కోటి సమితి చేస్తున్న అనేక కార్యక్రమాలను అభినందిస్తూ ప్రతి ఒక్కరూవిలువలతో కూడిన నడవడికను పెంపొందించుకోవాలని అన్నారు. 

స్వామి వారి ప్రేమ ను 2022 డైరీ రూపంలో స్వామి చిర కాల భక్తులు శ్రీ శరత్ చంద్ర గారు అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్ గారికి బహకరించారు. 

ఈ కార్యక్రమములో బాలవికాస గురువులు, విద్యార్థులు, మహిళలు,   కూడా పాల్గొన్నారు. 

అందరినీ ప్రేమించు అందరినీ సేవించు, మానవసేవే మాధవసేవ, ఒకే భాష అదే హృదయ భాష ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన కార్యక్రమము కందస్వామి లో గల షిరిడి బాబా దేవాలయంలో శ్రీ శ్రీ శరత్ చంద్ర గారు విద్యార్థుల నుద్దేశించి వాల్యూస్ గూర్చి విపులంగా పిల్లల కు అర్ధమయ్యే రీతిలో, రామయంలో లోని కధలు, మహాత్ముల జీవితాల విశేషాలలో మనం నేర్చుకోవలసిన అనేక విలువలను పిల్లలకు హత్తుకొనే విధముగా, తెలిపారు. 

ఈ నాటి కార్యక్రములో, బాలవికాస్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 




Thursday, December 9, 2021

BALAVIKAS - STUDENTS OBSERVATIONS.


BALAVIKAS - STUDENTS KOTI SAMITHI 


1. చిరంజీవి  సాయి రూప-మర్యాదస్తురాలు, నిదానంగా చెప్పినది పాటిస్తుంది, పాడుతుంది,

2. చిరంజీవి  భద్రాదేవి-సమయపాలన, నమ్రత కలది, చెప్పినది, ఎప్పటికప్పుడు నేర్చుకుంటుంది. 

3. మాస్టర్  ప్రణ వేందర్ రెడ్డి - చురుకుగా ఉంటాడు, ధైర్యంగా మాట్లాడతాడు, క్రికెట్ లో  శిక్షణ తీసుకుంటున్నాడు.  అమ్మ గారు బాల్ వికాస్ గా కోటి సమితి  మొదటి గురువు వున్నారు. 

4. మాస్టర్  హేమాంగ్ నాగ - హైపర్ యాక్టివ్, నాయకత్వ లక్షణాలు కలవాడు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వున్నాడు. 

5. చిరంజీవి జయ గాయత్రీ నాగ = నిదానంగా ఉంటుంది, నీట్ గా డ్రెస్ వేసుకుని ఉంటుంది, అమ్మ,నాన్న, గురువుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుంది

6.మాస్టర్ సాయి గుప్తా  -   తెలుగులో కథలు బాగా చెప్పగలడు, క్రమశిక్షణగా ఉంటాడు

7. మాస్టర్ లీలా ధర్ - వేదం, భజన చక్కగా చెప్తాడు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నది

8. మాస్టర్  సాయి - వేదం చక్కగా పలుకుతాడు, శ్రద్ధగా నేర్చుకుంటాడు

9. మాస్టర్  నాగ - ఎంతో ప్రేమగా ఉంటూ మర్యాదగా , ప్రవర్తిస్తాడు, క్షమా ప్రార్థన ఎంతో బాగా చెప్తాడు.

10. చిరంజీవి   శరణ్య - భజన పాటలు ధైర్యంగా  పాడుతుంది. 


                                                              ---O0O---- 


SRINIKHA -  8143381200   BHARANI=8184832287   Vaishnavi=9550901612

C/O SMT BHUVANESWARI 



Saturday, December 4, 2021

BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM.

 

BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM. 









శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ  సమితి ఆధ్వర్యంలో, కార్తీక మాసం చివరి రోజు, శనివారం అమావాస్య, అనురాధ నక్షత్రంలో,  మధ్యాహ్నం 1- 15 నిమిషాల నుంచి, 2-00  గంటల వరకు, కోఠీ బాలవికాస్ విద్యార్థుల చేత, శ్రీ రుద్ర పారాయణం గావిస్తూ, అందరూ అభిషేకం చేసుకోవటం ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమం జి.పుల్లారెడ్డి బిల్డింగ్స్, 6వ అంతస్థులో గల శ్రీ సత్య సాయి సేవా సంస్థుల,  మందిర ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లలంతా ఎంతో శ్రావ్యంగా, ఉచ్చారణ దోషములు లేకుండా, వారి తల్లితండ్రులతో కలసి వచ్చి పాల్గొని , స్వామి ఆశీస్సులతో జరిగి, అందరూ తీర్ధ  ప్రసాదములు తీసుకొని స్వామి అనుగ్రహనికి పాత్రులైనారు.  ఈ రోజు అంటే కార్తీక  అమవాస్య నాడు అభిషేకం చేస్తే, కార్తీక మాసమంతా చేసిన పుణ్యం దక్కుతుందని, ఈ రోజు ఈ కార్యక్రమాన్నీ చేయ తలపెట్టినాము. 


ఈ కార్యక్రమంలో భాగంగా, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, బాల్ వికాస్ గురువు గారు, శ్రీమతి శైలి శ్వరి   గారు, బాల్ వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి మహాలక్ష్మి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ రాము గారు, శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ మతి భువనేశ్వరి గారు, శ్రీ స్వామి యొక్క ఆశీస్సులతో  పాల్గొన్నారు. 


Sunday, October 10, 2021

DISTRICT LEVEL COMPETITIONS: - BHAJAN - DRAWING. & VEDAM.

సాయిరాం, (1). అక్టోబర్ 8 వ తేదీన, ఉదయం 11 గంటలకి జిల్లా స్థాయిలో భజన కాంపిటీషన్ నిర్వహించారు  దానిలో 

లీలాధర్, 

 ప్రణవ్ ,

భద్రాదేవి, 

కోటి సమితి తరఫున  పాల్గొన్నారు.

2. సాయంత్రం 3 గంటలకి

 జిల్లా స్థాయిలో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో 

హేమ0గ్, 

గాయత్రి 

 లీలాధర్ ,

 కోటి సమితి తరపున పాల్గొన్నారు.

అక్టోబర్ 10 వ తేదీన,  వేదం లో పోటీలు నిర్వహించారు. 

పాల్గొన్నవారు. (1) మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి, మాస్టర్ లీలాధర్, మరియు చి|| భద్రా దేవి.